ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నామినేష‌న్ల‌కు నేటీతో తెర‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 19, 2018, 07:18 AM

హైదరాబాద్: తెలంగాణ శాసనసభకు జరుగుతున్న ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ల పర్వం సోమవారంతో ముగియనుంది. సోమవారం మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్లు వేసేందుకు అవకాశం ఉంది. ఈనెల 12న ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన విషయం అందరికీ తెలిసిందే. అదే రోజు నుంచి నామినేషన్లను స్వీకరణ ఆరంభమైన సంగతి తెలిసిందే. కాగా గత ఆరు రోజుల్లో 1497 నామనేషన్లు దాఖలయ్యాయి. సోమవారం మరో వెయ్యి దాకా నామినేషన్లు దాఖలు కావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. నామినేషన్ల గడువు ముగిసిన అనంతరం సక్రమంగా ఉన్న నామినేషన్లపై, సక్రమంగా లేని నామినేషన్లపై ఎన్నికల కమిషన్ ఒక ప్రకటన చేస్తుంది. ఈమేరకు ఈనెల 20న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నవంబర్ 22 వరకు నామినేషన్ల ఉపసంసహరణకు గడువు ఉంది. పోటీలో ఎంతమంది అభ్యర్థులు మిగిలారో, ఏ పార్టీ తరఫున అభ్యర్థి ఎవరో అదే రోజు ప్రకటిస్తారు. ఆ తర్వాత ప్రచారం ప్రారంభమవుతుంది. 2019 డిసెంబర్ 5వ తేదీ సాయంత్రం 7 గంటల వరకూ ప్రచారం చేసుకునేందుకు వీలుంది. డిసెంబర్ 7న ఉదయం ఏడుగంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. డిసెంబర్ 11న ఓట్ల లెక్కింపునిర్వహించి అదే రోజున ఫలితాలు కూడా వెల్లడిస్తారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com