హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ మిగిలిన ఆరు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఆర్. క్రిష్ణయ్యకు మిర్యాలగూడ టిక్కెట్ కేటాయించారు.అలాగే సికింద్రాబాద్ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ పేరును అనూహ్యంగా ప్రకటించారు. అటు దేవకద్ర టికెట్ కోసం కూడా సీనియర్ నేతలు జైపాల్రెడ్డి, డీకె అరుణ తమతమ మద్దతుదారుల కోసం తీవ్రంగా పోటీపడ్డాయి. అయితే చివరకు డీకే అరుణ అనుచరుడైన పాబన్ కుమార్రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం టిక్కెట్ కేటాయించింది. కోరుట్ల - జువ్వాడి నర్సింగరావు, నారాయణఖేడ్ - సురేశ్ షెట్కర్,సికింద్రాబాద్ - కాసాని జ్ఞానేశ్వర్,మిర్యాలగూడ - కృష్ణయ్య. నారాయణపేట - వామనగిరి కృష్ణ, దేవరకద్ర - పవన్ కుమార్ రెడ్డి