తెలంగాణ ఎన్నికల బరిలో తొలిసారిగా ఓ ట్రాన్స్ జెండర్ పోటీలో నిలుస్తున్నారు. ఏకంగా మాజీ మంత్రి ముఖేష్ గౌడ్, బీజేపీ తాజా మాజీ ఎమ్మెల్యే రాజా సింగ్ పై ట్రాన్స్ జెండర్ చంద్ర ముఖి పోటీ చేస్తోంది. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బి ఎల్ ఎఫ్ ) నుంచి చంద్ర ముఖి కి టికెట్ లభించింది. ఆదివారం బి ఎల్ ఎఫ్ చైర్మన్ తమ్మినేని వీర భద్రం ఈ విషయాన్నీ వెల్లడించారు. చంద్ర ముఖి పేరును ప్రకటించారు. హైదరాబాద్ నడి బొడ్డులో ఉన్న గోషామహాల్ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి చంద్ర ముఖి పోటీ చేయనున్నట్టు తమ్మినేని చెప్పారు.