స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు దాటిపోయినా… కాపులుగానీ, మిగిలిన దళిత, బహుజన వర్గాలన్నీ కూడా రాజకీయాధికారానికి దూరంగా ఉన్నాయి. దీనివల్ల దళిత బహుజన బడుగు వర్గాలు చదువులు లేక, ఉద్యోగాలు లేక, తినడానికి తిండిలేక పేదరికంలో మగ్గిపోతూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ అన్నట్లు ఉన్నవాళ్లే ఉన్నవాళ్లు అవుతున్నారు. కాపుసారా కాసుకునే సీఎం రమేష్ కోట్లకు పడగలెత్తాడుగానీ బడుగు జనాలు గంజి మెతుకులతోనే కాలక్షేమం చేస్తున్నారు. దిగువ కులాల్లో అందరిదీ ఒకటే పరిస్థితి. అందుకే ముద్రగడ పద్మనాభం వంటి నేతలు కంచం చూపిస్తూ.. బీసీ రిజర్వేషన్ హోదా ఇవ్వండి అంటూ ఉద్యమాన్ని నడిపారు. ఇది ముందుకు వెళ్లకుండా ఆగిపోయింది.దేవుడు అందరికీ ఒకే జీవితాన్ని ఇచ్చినా.. సామాజిక హోదాను మాత్రం ఇవ్వలేదు. ఇంకా కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతూ ‘మన ఖర్మ. బతుకులు ఇంతే’ అని బడుగు వర్గాలు ఊరుకుని ఉండాల్సిన పని లేదు. పవన్ కళ్యాణ్ జనసేన తరఫున రెల్లి కులస్థులను కలిసి మాట్లాడారు. చేనేత కార్మికులను గానీ, చేతి వృత్తులు చేసుకునే కార్మికులను గానీ ఎవరినీ రాజకీయ పార్టీలు ఆదుకున్నది లేదు. రెల్లి కులస్థుల సమస్యలను విన్న పవన్ కళ్యాణ్ కన్నీళ్లను బలవంతంగా ఆపుకున్నారు. ఆ భావోద్వేగంలో ‘‘నేను ఈ రోజు నుంచి రెల్లి కులస్థుడినే అమ్మా… ఎవరైనా అడిగితే మాకు పవన్ ఉన్నాడని చెప్పండి’’ అని అన్నారు. ప్రజలది మూకుమ్మడి మనస్తత్వం. నువ్వెవరివి మంచి చెప్పడానికి అని ప్రశ్నిస్తే నేను దైవ కుమారుడిని అని ఏసు క్రీస్తు చెప్పాడు. మంచి చెప్పిన మహ్మద్ ప్రవక్తను నువ్వెవరివి చెప్పడానికి అని అంటే ఆ అల్లా ఆదేశమని చెప్పాడు. పవన్ ఏం చెబుతాడు? రెల్లి కులస్థుడనని, మీ వాడినే అని అంటాడు. బాధపడే వాడిది ఏ కులమైతే నాదే అదే కులమని చెబుతున్నాడు. అణిచివేతకు గురయ్యే వాడి కులమని చెబుతున్నాడు. బడుగులతో మమేకం అవుతున్నాడు. సామాన్యుడి గొంతు ఈ కుట్రల కీకారణ్యంలో ఎవరికీ వినిపించదు. పవన్ గొంతు వేయి గొంతుకలై… దుర్మధాంధులను దునుమాడుతోంది. వజ్రాయుధమై వారిని వెంటాడుతున్నది. తాడిత పీడిత వర్గాలు ఆయన వెనక నడిస్తే నల్లడబ్బు ‘కట్టల’ పాముల పీచమణచడం చిటికెలో పని. సమరానికి సన్నద్ధం అవ్వండి. శంఖం పూరించాడు. ఇపుడు పవన్ అంటే ఒక ఝంఝా మారుతం! విజయ దుంధుబి మోగిద్దాం. ప్రభలు కడదాం. లేవండి.. బడుగులు అంటే… డబ్బున్న వర్గాల అడుగులకు మడుగులు వత్తే వాళ్లం కాదని నిరూపించే సమయమిదే!!