డిసెంబర్ 11 నాడు మహాకూటమి కనుమరుగవుతుందని సూర్యాపేట టీఆర్ఎస్ అభ్యర్థి, ఆపద్ధర్మ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట ఆర్డీవో కార్యాలయంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన అనంతరం జగదీశ్రెడ్డి మాట్లాడారు. కేసీఆర్ తుఫాన్లో అన్ని పార్టీలు కొట్టుకుపోతాయన్నారు. కాంగ్రెస్ నేతలు తెలంగాణ వ్యతిరేక టీడీపీతో జతకట్టి చరిత్ర హీనులుగా మిగిలారని విమర్శించారు. అమరావతి, ఢిల్లి వద్ద తమ ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రతిపక్ష పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కవని వ్యాఖ్యానించారు. సూర్యాపేటలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు శాంతి భద్రతలను సమానంగా కాపాడినట్లు చెప్పారు. అందుకే సూర్యాపేట ప్రజలు గులాబీ పార్టీకే మద్దతుగా ఉన్నారని వివరించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు తెలంగాణ వ్యతిరేక టీడీపీతో జట్టుకట్టి చరిత్ర హీనులుగా మిగిలారని అన్నారు. కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలవబోతున్నారని చెప్పారు. సూర్యాపేట ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చడంలో సఫలం అయ్యామని అన్నారు. ఎన్ని కూటములు వచ్చినా తెలంగాణలో కేసీఆర్ విజయాన్ని అపలేరని ధీమా వ్యక్తం చేశారు.