హైదరాబాద్ : ప్రభుత్వం చేపట్టిన పథకాలే తనను గెలిపిస్తాయని ఆపద్ధర్మ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం తలసాని మాట్లాడుతూ మహాకూటమి మాయకూటమి అని దుయ్యబట్టారు. అనైతిక పొత్తులతో ప్రజల ముందుకు వస్తున్నారని విమర్శించారు. 119 నియోజక వర్గాల్లో పోటీ చేస్తానన్న టిజెఎస్ అధ్యక్షుడు కోదండరామ్ మూడు సీట్లకే పరిమితమయ్యారని వ్యంగ్యంగా అన్నారు.