హుస్నాబాద్ శాసనసభ అభ్యర్థిగా మహా కూటమి బలపరుస్తున్న చాడ వెంకటరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. హుస్నాబాద్ ఆర్డీవో కార్యాలయంలో ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. సిపిఐ పార్టీ ఇంచార్జ్ రాష్ట్ర కార్యదర్శి పల్లా వెంకట రెడ్డి, జిల్లా కార్యదర్శి కోమటిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి , జన సమితి, తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు.