తాను లోకలేనని కూకట్ పల్లి తెలుగుదేశం అభ్యర్థి, దివంగత నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని అన్నారు. తాను టెన్త్ నుంచి పీజీ వరకూ కూకట్ పల్లిలోనే చదువుకున్నానని చెప్పారు. ఈ రోజిక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో విలేకరులతో మాట్లాడిన ఆమె..తాను నాన్ లోకల్ అని విమర్శించే వారికి బహుశా ఆ విషయం తెలిసి ఉండదని ఆమె అన్నారు.