ఖమ్మం ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న తెరాస అధినేత కెసిఆర్ రాష్ట్రం బాగుండాలని రాజశ్యామల హోమం చేశానన్నారు. ఖమ్మంలో 10 కి 10 స్థానాలను గెలవబోతున్నామన్న కెసిఆర్ ఖమ్మం తలపండిన రాజకీయ నేతలున్న జిల్లా అన్నారు. గతంలో కూడా జిల్లాకు చాలాసార్లు వచ్చానని.. వందకు వంద శాతం జిల్లాలో ఎన్నికల ప్రణాళికను అమలు చేశామని.. ప్రజలకు వందశాతం హామీలను అమలు చేశామన్నారు. తమ ప్రభుత్వం మీద చేస్తున్న విమర్శలు హాస్యాస్పదం అన్నారు.