ఖమ్మం: తెలంగాణలో తెరాస ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నూటికి నూరుశాతం హమలుచేశామన్నారు. డబుల్ బెడ్ రూం ఇల్లు, దళితులకు మూడెకరాల భూమిపై విమర్శలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. తెరాస తలపెట్టిన డబుల్ బెడ్ రూం ఇల్లు కాంగ్రెస్, టీడీపీ హయంలో కట్టిన ఏడు ఇళ్లకు సమానమన్నారు. ఒకసారి ఇల్లు కట్టిస్తే రెండు తరాల వరకు ఇల్లు కట్టుకోకూడదు.. ఆరునెలలు ఆలస్యం అయితే కొంపలేమీ అంటుకోవు కదా.. ఆలస్యం అయినా అందరికి హామీ చేరుతుందని.. రెండు తరాలు ఇంటి ప్రస్తావనకు రాకూడదని ఇదే డబుల్ బెడ్ రూం ఇళ్ల ఉద్దేశ్యమన్నారు.