తెలంగాణ ఎన్నికల ప్రచారం చివరికి చేరుకోవడంతో అన్ని పార్టీల మధ్య వార్ పీక్ స్టేజ్కి చేరింది. మధ్యలో సర్వేల పేరుతో జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. రాష్ట్రంలో కొన్ని సంస్థలు సర్వేల పేరుతో రోజుకో నెంబర్ రిలీజ్ చేస్తున్నాయి. ఒక సర్వేలో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంటుందని చెబితే, మరో సర్వే ప్రజాకూటమికి ఫేవర్గా ఉంటోంది. దీంతో ఏ సర్వేలు నమ్మాలో తెలియని గందరగోళం ఏర్పడింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రా ఆక్టోపస్గా పేరుగాంచిన లగడపాటి రాజగోపాల్ సర్వే అందరిలోనూ ఉత్సాహం నింపింది. తెలంగాణలో ప్రజా వాణి ప్రజాకూటమికే అనుకూలంగా ఉందని లగడపాటి చెప్పారు. ఎనిమిది నుంచి పది మంది ఇండిపెండెంట్లు గెలవొచ్చని చెప్పారు. ఓటింగ్ శాంత పెరిగితే ప్రజాకూటమికి అధికారం వస్తుందని, తగ్గితే హంగ్ వచ్చే చాన్స్ ఉందన్నారు. అయితే, లగడపాటి సర్వేపై మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
గతంలో తెలంగాణ ఎన్నికలపై సర్వే నిర్వహించిన లగడపాటి తనకు ఓ మెసేజ్ చేశారని, ఆ మెసేజ్ స్క్రీన్ షాట్ను కేటీఆర్ ట్విట్టర్లో పంచుకున్నారు. నవంబర్ 20న లగడపాటి చేసిన సర్వే వివరాలను తనకు పంపారని చెప్పారు. ఆ సర్వేలో టీఆర్ఎస్ పార్టీకి 65 నుంచి 70 సీట్లు వస్తాయని తెలిపారు. ఈ విషయం చంద్రబాబుకు కూడా చెప్పినట్టు మరో మెసేజ్ పంపినట్టు వివరించారు.
The reason I dismiss Rajgopal’s survey as concocted; This message to me on 20th Nov that TRS is winning 65-70 seats
It’s the same survey he shared today under pressure from CBN with cooked up numbers
P.s: I had no choice but to share this conversation to break the conspiracy pic.twitter.com/vUJ77KpmFc
— KTR (@KTRTRS) December 4, 2018