హైదరాబాద్: కూకట్పల్లి బాలాజీనగర్ లోని ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కార్పోరేషన్ ఛైర్మన్ జూపూడి ప్రభాకర్ రావు ఇంటిలో పోలీసుల సోదాలు నిర్వహించారు. జూపూడి ఇంటి వెనుక నుండి డబ్బుల మూటతో పారిపోతున్న ఇద్దరిని డబ్బులతో సహా టీఆర్ఎస్ కార్యకర్తలు పట్టుకున్నారు. అదే విధంగా వరంగల్ పట్టణం సిద్దార్థ నగర్ లో రూ. 3కోట్ల పైగా నగదు పట్టుబడింది. వర్ధన్నపేట అభ్యర్థి పగిడిపాటి దేవయ్యకు చెందిన డబ్బుగా చెబుతున్నారు. డబ్బుతో పాటు ఓటరు స్లిపులు లభ్యం అయ్యాయి.