వికారాబాద్ జిల్లా కోస్గి మండలం బలభద్రయ్యపల్లిలో ఓ వ్యక్తి నుండి పోలీసులు యాభై లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. నగదు తరలిస్తున్న వ్యక్తి తెరాస పార్టీకి చెందిన వ్యక్తి కాగా నగదు కూడా అదే పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డివిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవలే నరేందర్ రెడ్డి బంధువు ఫామ్ హౌస్ లో యాభై లక్షలు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.