ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలింగ్ బూత్‌కు 5 గంటల వరకు చేరుకోవచ్చు: రజత్ కుమార్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 06, 2018, 06:27 PM

హైదరాబాద్: రాష్ట్రంలో రేపు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ సచివాలయం నుంచి మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడిన ఆయన మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలయినటువంటి 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరుగుతుందన్నారు. ఆ నియోజకవర్గాల్లో ఓటేసేవాళ్లు సాయంత్రం 4 వరకు పోలింగ్ బూత్‌కు చేరుకోవాలన్నారు. 4 వరకు క్యూలో నిలుచున్న వాళ్లకు ఓటు వేసే వెసులుబాటు కల్పిస్తామని.. 4 తర్వాత పోలింగ్ బూత్‌కు వచ్చేవాళ్లను ఓటు హక్కు వినియోగించుకోవడానికి అనుమతించరని ఆయన తెలిపారు. మిగితా నియోజకవర్గాల్లో సాయంత్రం 5 వరకు పోలింగ్ ఉంటుంది. సాయంత్రం 5 వరకు పోలింగ్ బూత్‌కు వెళ్లేవాళ్లు ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. 5 దాటిన తర్వాత పోలింగ్ బూత్‌కు చేరుకునేవాళ్లను ఓటు హక్కు వినియోగించుకోవడానికి అనుమతించరని రజత్ స్పష్టం చేశారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com