హైదరాబాద్: రాష్ట్రంలో రేపు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ సచివాలయం నుంచి మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడిన ఆయన మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలయినటువంటి 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరుగుతుందన్నారు. ఆ నియోజకవర్గాల్లో ఓటేసేవాళ్లు సాయంత్రం 4 వరకు పోలింగ్ బూత్కు చేరుకోవాలన్నారు. 4 వరకు క్యూలో నిలుచున్న వాళ్లకు ఓటు వేసే వెసులుబాటు కల్పిస్తామని.. 4 తర్వాత పోలింగ్ బూత్కు వచ్చేవాళ్లను ఓటు హక్కు వినియోగించుకోవడానికి అనుమతించరని ఆయన తెలిపారు. మిగితా నియోజకవర్గాల్లో సాయంత్రం 5 వరకు పోలింగ్ ఉంటుంది. సాయంత్రం 5 వరకు పోలింగ్ బూత్కు వెళ్లేవాళ్లు ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. 5 దాటిన తర్వాత పోలింగ్ బూత్కు చేరుకునేవాళ్లను ఓటు హక్కు వినియోగించుకోవడానికి అనుమతించరని రజత్ స్పష్టం చేశారు.