హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. చాలా మంది ప్రముఖులు ఉదయాన్నే ఓటు హక్కును వినియోగించుకున్నారు. సిద్దిపేటలో హరీష్రావు దంపతులు, సూర్యాపేటలో జగదీశ్వర్రెడ్డి, ఖమ్మం జిల్లాలో తుమ్మల నాగేశ్వరరావు ఓటు వేశారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో సంగీత దర్శకుడు కీరవాణి కుటుంబ సమేతంగా వచ్చి ఓటేశారు.