హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబ్లీక్లబ్లో కుటుంబసభ్యులతో కలిసి చిరంజీవి ఓటు వేశారు. ప్రతీ ఒక్కరూ ఓటు వేయాలని, అది అందరి బాధ్యత అని పిలుపునిచ్చారు. రామ్చరణ్ విదేశాలకు వెళ్లడంతో ఈ సారి ఓటు వేసే అవకాశం కోల్పోయాడన్నారు. తన భార్య, ఇద్దరు కూతుళ్లతో కలిసి ఓటు వేసినట్లు ఈ సందర్భంగా చిరంజీవి తెలిపారు.