ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాంగ్రెస్ యువనేతలను అభినందిస్తూ మాల్యా ట్వీట్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 13, 2018, 06:53 PM

విజయ్ మాాల్యా ట్వీట్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. ఆ ఇద్దరు నాయకుల సీఎం అవకాశాలను దెబ్బతీసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి లండన్ పారిపోయిన విజయ్ మాల్యా‌.. కాంగ్రెస్ నాయకులు సచిన్ పైలట్, జ్యోతిరాదిత్య సింథియాలను అభినందిస్తూ ట్వీట్ చేశారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ కాంగ్రెస్ విజయం సాధించి సందర్భంగా మాల్యా వారిపై ప్రశంసలు గుప్పించారు. వీరిద్దరిని ప్రశంసిస్తూ మాల్యా ట్వీట్ చేయడంతో.. ఆయనతో కాంగ్రెస్ పార్టీకి అనుబంధం ఉందనే ప్రచారం జరిగే అవకాశం ఉంది. అదే జరిగితే కాంగ్రెస్ పార్టీ ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటుంది. 


తాను బ్యాంకు రుణాలను ఎగ్గొట్టి పారిపోయానని చిత్రీకరించారంటూ.. రాజకీయ నాయకులు, మీడియాపై ఆయన గతంలో విమర్శలు ఎక్కుబెట్టారు. నేనే బాధితుణ్నంటూ సానుభూతి పొందే ప్రయత్నం చేశారు.బ్యాంకులకు సుమారు రూ.9 వేల కోట్లు ఎగొట్టిన మాల్యాను తమకు అప్పగించాలని భారత్ బ్రిటన్‌ను కోరుతోంది. వెస్ట్ మినిస్టర్ కోర్టు కూడా భారత్‌కు అనుకూలంగా తీర్పును వెలువరించింది. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com