ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా తెలంగాణ భవన్కు బయల్దేరారు. మరికాసేపట్లో కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ర్యాలీలో కేటీఆర్తో పాటు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు పద్మారావుగౌడ్, మహేందర్రెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్లు ఉన్నారు. భారీ ర్యాలీలో 20 వేల మంది కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ర్యాలీ తెలంగాణ భవన్ వరకు కొనసాగనుంది.