హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కల్వకుంట్ల తారకరామారావు బాధ్యతలు స్వీకరించారు. 20వేల మంది కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా తెలంగాణ భవన్కు చేరుకున్న కేటీఆర్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఛాంబర్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లికి, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి కేటీఆర్ పూలమాలలు వేశారు. తెలంగాణ భవన్ వద్ద కేటీఆర్కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. తెలంగాణ భవన్ తో పాటు పరిసర ప్రాంతాలు జనసంద్రంగా, గులాబీమయంగా మారింది. తెలంగాణ భవన్ దగ్గర పండగ వాతావరణం నెలకొంది. కేటీఆర్ బాధ్యత స్వీకరణకు హరీశ్రావు, సీనియర్ నేతలు హాజరయ్యారు.