కుల వృత్తులకు పూర్వవైభవం తేవడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఇందుకు తన వంతు కృషి చేస్తానని ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ తెలిపారు. ఎంబీసీ చైర్మన్గా నియామకమైన సందర్భంగా తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాలలు వేసారు. తన మీద నమ్మకంతో ఎంబీసీ చైర్మన్ గా అవకాశమిచ్చిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి వెనుక బడిన బీసీ కులానికి ఫలాలు అందేలా పని చేస్తానని స్పష్టం చేసారు.