ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌ చిత్ర ప్రదర్శన నిలిపివేత

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 11, 2019, 05:18 PM

కోల్‌కతాలో యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌ చిత్ర ప్రదర్శనను నిలిపివేశారు. కాంగ్రెస్‌ నాయకుడు మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిగా బాధ్యతలు నిర్వహించిన కాలం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. నేడు కోల్‌కతాలోని హింద్‌ ఐనాక్స్‌ సినిమా హాలు వద్ద యువజన కాంగ్రెస్‌ కార్యకర్తలు ధర్నా చేశారు. దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. హాలులో సినిమా ప్రారంభమైన తరువాత బైట యువజన కార్యకర్తల ఆందోళన తీవ్రతరమవుతుండటంతో సివిల్‌ డ్రెస్‌లో ఉన్న పోలీసులు హాల్లోకి ప్రవేశించి ప్రేక్షకులను వెళ్లిపోవాల్సిందిగా కోరారు. తమను చిత్ర ప్రదర్శన ఆపేయాలని ఎవరూ కోరలేదని, కాని ప్రేక్షకుల క్షేమం దృష్ట్యా చిత్ర ప్రదర్శన నిలిపివేశామని హాలు యాజమాన్యం పేర్కొంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com