ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మల్లు భట్టి విక్రమార్క మీడియాతో చిట్ చాట్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Jan 20, 2019, 07:17 PM

పంచాయతీ ఎన్నికలు కాగానే సీఎల్పీ సమావేశం మళ్ళీ ఒక్కసారి జరుగుతుందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. అప్పుడు సీఎల్పీ కమిటీ ల పై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆదివారం ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. సభ్యులు ఎవరికి ఆసక్తి ఉన్న సబ్జెక్ట్ లపై వారు మాట్లాడుతారని అన్నారు. ఇప్పటివరకు ప్రాజెక్ట్ ల మీద రూ.1 లక్ష కోట్ల వరకు ఖర్చు పెట్టారు. ఒక్క ఎకరానికి అయినా నీళ్లు వచ్చాయా, ఈ ఖర్చు ద్వారా పారె నీళ్లలో కనబడాలి అన్నారు. కానీ అలా ఎక్కడా లేదు. కేవలం సాగునీటి ప్రాజెక్టుల మీద రూ.2.25 లక్షల కోట్లు ఖర్చు పెట్టడం ఎక్కడ చూడలేదు, దీని పైన ప్రభుత్వం రెండో అభిప్రాయం తీసుకోవాలన్నారు. ఈ నిధుల పై అర్ధవంతమైన చర్చ జరగాల‌న్నారు.
సీఎం ప్రాజెక్ట్ లకు నేనే డిజెన్ చేస్తా అంటున్నారు. సీఎం కు టెక్నికల్ గురించి తెలుసా లేదా. నిపుణుల కమిటీ వేయాలి. నిధులు అర్థవంతంగా ఖర్చు చేయాలి. లేకపోతే టెక్నికల్ టీం తో ప్రాజెక్టుల బాట పడుతామన్నారు. నన్ను సీఎల్పీ నేత ఎంపిక చేసినందుకు హైకమాండ్ కు ధన్యవాదాలు త్వరలోనే తెలియజేయడానికి ఢిల్లీ వెళ్తానన్నారు. పీసీసీ తో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ప్రభుత్వం పై నిర్మాణాత్మకంగా పోరాడుతామన్నారు. రెండేళ్లుగా ప్రజా సమస్యల పై చర్చలు జరగకపోవడం విచారకరం. వచ్చే అసెంబ్లీ సమావేశంలోనైనా ప్రభుత్వం ఎక్కువ రోజులు సమావేశాలు జరపాలి. ప్రతి 15 రోజులకు ఒక్కసారి సీఎల్పీ సమావేశం నిర్వహిస్తాం. హుందాగా సభను నడుపుకుందామని చెప్పిన సీఎం పిరాయింపులకు పాల్పడ్డాడు. రెవిన్యూ సదస్సు ప్రతి సంవత్సరం టి ఆర్ ఎస్ చేయలేదు. భూ ప్రక్షాళన పేరు మీద  ఉమ్మడి రాష్ట్ర పాస్ బుక్ లను తొలగించి, కొత్త పాస్ బుక్ లు ఇచ్చారు. భూ ప్రక్షాళన పేరు మీద ఎలాంటి ప్రక్షాళన జరగలేదు. ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. భూ ప్రక్షాళన పేరు మీద కొత్త సమస్యలు వచ్చాయి.


 


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com