నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో రైతుల ఆందోళన కొనసాగుతోంది. పసుపు, ఎర్రజొన్న పంటలకు మద్దతు ధర ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నిన్న అర్ధరాత్రి సమయంలో కూడా ఎర్రజొన్న, పసుపు రైతులు గిట్టుబాటు ధర కోసం పోరాటం కొనసాగించారు. జక్రాన్పల్లి జాతీయ రహదారి మీద రైతులు పడుకుని నిరసన వ్యక్తం చేశారు. నిన్న అర్ధరాత్రి 2 గంటలకు పోలీసులు అన్నదాతలను అరెస్ట్ చేశారు. అరెస్ట్కు నిరసనగా రైతులు మళ్లి ఆందోళనకు దిగారు.