హైదరాబాద్: జూబ్లీహిల్స్ సీఆర్పీఎఫ్ కార్యాలయంలో అమర జవాన్లకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా అమర జవాన్ల కుటుంబాలకు రూ.25 లక్షల విరాళాన్ని ప్రకటించారు. కేటీఆర్ స్నేహితులు కూడా మరో రూ.25లక్షలు విరాళాన్ని అందజేశారు. రూ.50లక్షల చెక్కును సీఆర్పీఎఫ్ ఐజీ జీహెచ్పీ రాజుకు కేటీఆర్ అందజేశారు. పుల్వామా ఉగ్రదాడి ఎంతగానో కలచివేసిందని కేటీఆర్ అన్నారు. కేవలం జవాన్ల వల్లే మనమంతా క్షేమంగా ఉన్నామని పేర్కొన్నారు.