హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినం సందర్భంగా బేగంపేటలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కుటుంబ సభ్యులు మొక్కలు నాటారు. సీఎం సతీమణి శోభ, కుమారుడు కేటీఆర్, అయన సతీమణి, మనవరాలు పాల్గొన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు ఒక్కొక్కరు ఒక్కో మొక్కను నాటారు. సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని, కేసీఆర్కు కుమారుడిగా జన్మించినందుకు ఎంతో గర్వపడుతున్నాయని కేటీఆర్ ట్విటర్లో పేర్కొన్నారు. కేసీఆర్ జన్మదినం సందర్భంగా ప్రధాని మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఎల్లప్పుడూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించారు.