తెలంగాణ అభివృద్ధి చెందాలంటే హైదరాబాద్ అభివృద్ధి ముఖ్యమని రాష్ట్ర డీజీపీ మహేందర్రెడ్డి అన్నారు. నేరేడ్మెట్లో రాచకొండ పోలీస్ కమిషనరేట్ నూతన కార్యాలయ భవనం ప్రారంభోత్సవంలో డీజీపీ మాట్లాడారు. హైదరాబాద్ నగరం తెలంగాణకు లైఫ్లైన్ అని సీఎం చెప్తుంటారన్నారు. రాష్ట్రంలో, హైదరాబాద్లో శాంతి భద్రతలకు సీఎం అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. అభివృద్ధి చెందిన దేశాలకు ధీటుగా పోలీస్ వ్యవస్థ ఉండాలని సీఎం సంకల్పించారని పేర్కొన్నారు. రాష్ట్ర ఆవిర్భావం తొలినాళ్లలోనే పెట్రోలింగ్ కోసం ఆధునిక వాహనాలు ఇచ్చారన్నారు. పోలీసు శాఖకు ఒకేసారి 11,500 వాహనాలు సమకూర్చి, శిక్షణ కూడా ఇప్పించారన్నారు. పోలీసుశాఖలో 18వేల ఉద్యోగాలకు అనుమతి ఇచ్చారన్నారు. ప్రభుత్వం, వ్యవస్థలు కల్పించే నమ్మకం మీదే అభివృద్ధి ఆధారపడి ఉంటుందన్నారు. పౌరులకు పోలీసులపై నమ్మకం పెంచేందుకు అనేక చర్యలు చేపట్టామన్నారు. సాంకేతికత, వసతుల కల్పనతో పోలీసు శాఖ సేవలు పౌరులకు మరింత చేరువయ్యాయన్నారు. ప్రజల సహకారంతో హైదరాబాద్ను నేరరహిత నగరంలో తీర్చిదిద్దుతున్నామన్నారు. నగరంలో 5లక్షల సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు.