రంగారెడ్డి: ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా మొయినాబాద్ మండలం హిమాయత్ నగర్ లో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో మాజీ మంత్రి మహేందర్ రెడ్డి, చేవెళ్ల ఎంఎల్ఏ యాదయ్య, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. సీఎం జన్మదినం సందర్భంగా బాల సదనం లో మాజీ మంత్రి మహేందర్ రెడ్డి, చేవెళ్ల ఎంఎల్ఏ యాదయ్య అనాధ పిల్లల కు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో గతంలో ఎక్కడా, ఎన్నడూ లేని విధంగా పేదల, రైతులు, మహిళలు, పీడిత జనం కోసం కేసీఆర్ తపించారన్నారు.