టీటీడీ పాలకమండలి సభ్యుడిగా తెలంగాణ వాసిని నియమించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. టీటీడీ పాలకమండలి సభ్యుడిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి చెందిన కోనేరు సత్యనారాయణ (చిన్ని)ని ఎంపిక చేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని మీడియాకు వెల్లడించింది. ఇటీవల టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను ఏపి ప్రభుత్వం టి.టి.డి పాలక మండలి సభ్యుడిగా తిరిగి నియమించినా, ఆయన నిర్దేసించిన సమయంలో ప్రమాణ స్వీకారం చేయలేదు. దీంతో ఆయన నియామకాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే.