తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ములుగు, నారాయణ పేట జిల్లాలతో ఇప్పుడు 33 జిల్లాల ఏర్పాటు జరిగినట్టయ్యింది. 9 మండలాలతో ములుగు జిల్లాను ఏర్పాటు చేసింది. ములుగు జిల్లాలో ప్రస్తుతం ములుగు, వెంకటాపూర్, గోవిందరావుపేట, తాడ్వాయి (సమ్మక్క-సారక్క), మంగపేట , వాజేడు, ఏటూరునాగారం, కన్నాయిగూడెం, వెంకటాపురం మండలాలు చేరాయి. కాగా, ములుగు జిల్లాగా అవతరించడంతో అక్కడ సంబరాలు మిన్నంటుతున్నాయి. ములుగులో కలెక్టరేట్ ప్రారంభమైంది. ఇన్ఛార్జి కలెక్టర్ వెంకటేశ్వర్లు కలెక్టరేట్ను ప్రారంభించారు. అలాగే ఎస్పీ కార్యాలయాన్ని ఎస్పీ భాస్కరన్ ప్రారంభించారు. కొత్తగా ఏర్పాటైన ములుగు జిల్లాలో ఆదివారం నుంచి పాలన ప్రారంభమవుతోంది. కొత్త జిల్లా ఆవిర్భావ వేడుకలు జరుగుతున్నాయి.