పుల్వామా దాడిలో అమరులైన జవాన్లకు కేటీఆర్ విరాళం అందచేశారు. వ్యక్తిగతంగా రూ.25 లక్షలు, తన ముగ్గురి స్నేహితుల తరపున మరో రూ.25 లక్షలు విరాళం ఇచ్చారు. జూబ్లి హిల్స్ లోని సీఆర్ఫీఎఫ్ సదరన్ హెడ్ క్వార్టర్స్ లో కేటీఆర్ అమర జవాన్లకు నివాళులు అర్పించారు. భద్రతా దళాల వల్లే మనం క్షేమంగా ఉన్నామని అమరుల త్యాగాలను మరువలేమని కేటీఆర్ తెలిపారు.