కిడ్నీ బాధితులకు టీఎస్ఆర్టీసీ ప్రత్యేక రాయితీలను కల్పించింది. ఇకపై టీఎస్ఆర్టీసీ బస్సుల్లో కిడ్నీ బాధితులు ఉచితంగా ప్రయాణం చేయవచ్చని ఆర్టీసీ సంస్థ ఇన్ఛార్జి ఎండీ సునీల్శర్మ ప్రకటించారు. మరుగుజ్జులకు కూడా 50 శాతం రాయితీ కల్పిస్తున్నట్టు తెలిపారు. అలాగే కిడ్నీ బాధితుల ఉచిత ప్రయాణానికి బస్సు పాసులు ఇస్తామని పేర్కొన్నారు.
ఆరోగ్యశ్రీ పథకం క్రింద డయాలసిస్ చేయించుకునే 7,600 మందికి దీని ద్వారా లబ్ధి చేకూరుతుందని తెలిపారు. పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్లతో పాటు హైదరాబాద్, వరంగల్ నగరాల్లో సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, డీలక్స్ బస్సుల్లోనూ ప్రయాణానికి అనుమతిస్తామన్నారు. ఈ రాయితీల వలన ఆర్టీసీపై పడే రూ.12.22 కోట్ల ఆర్థిక భారాన్ని ప్రభుత్వం రీయింబర్స్మెంట్ కింద తిరిగి చెల్లిస్తుందని ఆయన వెల్లడించారు.