మెదక్ జిల్లాలోని రామాయంపేట మండలం జాన్సి లింగాపూర్ గ్రామంలో అటవీ ప్రాంతంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. అడవిలో ప్రేమజంట ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతులు జాన్సి లింగాపూర్ గ్రామానికి చెందిన బాలు, నిజాంపేట్ మండలం రాయలపూర్ గ్రామానికి చెందిన యువతిగా గుర్తించారు. కులాలు వేరు కావడంతో పెద్దలు వీరి పెళ్లికి అంగీకరించలేదని సమాచారం. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.