హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ జిల్లాల అధ్యక్షులతో నేడు సమావేశం కానున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేసే అంశంపై నేతల అభిప్రాయాలను రమణ తెలుసుకోనున్నారు. గత వారం 14 జిల్లాలకు చెందిన అధ్యక్షుల అభిప్రాయాలను టీటీడీపీ అధిష్టానం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అంశాన్ని జాతీయ నాయకత్వం…తెలంగాణ టీడీపీకే అప్పజెప్పడంతో రమణ జిల్లాల అధ్యక్షులతో సమావేశం కానున్నారు.