కరీంనగర్: పోలీసు ఫిజికల్ పరీక్షలో అపశ్రుతి చోటు చేసుకుంది. రన్నింగ్ చేస్తుండగా మమత అనే యువతి గుండెపోటుతో మృతి చెందింది. మృతురాలి స్వస్థలం రామడుగు మండలం వెలిచాల. మృతదేహాన్ని కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన విషాదకరమని కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలహాసన్రెడ్డి తెలిపారు. ఎవరైనా అభ్యర్థులు అనారోగ్యంతో ఉంటే తమకు సమాచారం ఇవ్వాలని వారికి తర్వాతి రోజు పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. మృతురాలి కుటుంబీకులను ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా అదుకుంటామని ప్రకటించారు.