మద్నూరు: కామారెడ్డి జిల్లా మద్నూరు మండలం మేనూరు గ్రామం సమీపంలో పెట్రోల్బంక్ వద్ద జాతీయ రహదారిపై సోమవారం ఉదయం లారీ కారు ఢీకొని ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా పనిచేస్తున్న గచ్చిబౌలికి చెందిన లక్ష్మీ నారాయణ(32), బిహార్కు చెందిన రాజన్(26), విజయ్కుమార్, కోమల్ సింగ్ కారులో షిర్డీ వెళ్లి హైదరాబాద్కు తిరిగి వస్తున్నారు. మద్నూరు సమీపంలో వీరి కారును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లక్ష్మీనారాయణ, రాజన్ అక్కడికక్కడే మృతి చెందారు. విజయ్, కోమల్కు తీవ్రంగా గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించారు. మృత దేహాలను శవపంచనామ నిమిత్తం మద్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాజిద్ తెలిపారు.