న్యూఢిల్లి : ఎయిర్సెల్ మాక్సిస్ కేసులో నిందితులైన కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ చిదంబరాలకు ఇక్కడి పాటియాలా హౌస్ కోర్టులో ఊరట లభించింది. వారిని అరెస్టు చేయకుండా గతంలో ఇచ్చిన మధ్యంతర ఆదేశాలను కోర్టు పొడిగించింది. మార్చి 8వ తేదీ వరకూ వారిని అరెస్టు చేయకుండా ఆదేశాలు జారీ చేసింది.