జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఒక కమాండర్ను భారత సైన్యం అరెస్టు చేసినట్లు సమాచారం అందింది. సిఆర్పిఎఫ్పై దాడి జరిగిన ప్రాంతంలో ఉగ్రవాదులకు, సైన్యానికి మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఇద్దరు జైషే ఉగ్రవాదులు హతమయ్యారు. పుల్వామా ఘటన తరువాత గాలింపు జరుపుతున్న సైన్యంపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఒక మేజర్ సహా నలుగురు జవాన్లు మృతి చెందారు. ఈ సందర్భంగా జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. పుల్వామాలో సిఆర్పిఎఫ్పై దాడిలో ఈ ఉగ్రవాదులు కీలక పాత్ర పోషించారు.