మెదక్: మెదక్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు బోల్తాపడటంతో జరిగిన ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు విజయవాడకు చెందిన జగదీశ్, మహబూబ్నగర్కు చెందిన అభిషేక్లుగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.