కామారెడ్డి జిల్లాలోని బిక్కనూర్ మండలం బస్వాపూర్లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. వివాహితను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. ఉదయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దగ్గరి బంధువులే హత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.