యాదాద్రి భువనగిరి : భువనగరిలో కేంద్రీయ విద్యాలయం భవన నిర్మాణానికి టీఆర్ఎస్ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ.. త్వరలో మహిళా సైనిక్ స్కూల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామన్నారు. మాతాశిశు సంరక్షణ ఆస్పత్రి ఏర్పాటుకు కేంద్రం ఆమోదించిందని తెలిపారు. భువనగిరిని విద్య, వైద్య హబ్గా మార్చడమే తన లక్ష్యమని ఎంపీ ఉద్ఘాటించారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటు వేస్తే రాష్ట్రం తిరోగమనంలోకి వెళ్తుందన్నారు.