ఇస్లామాబాద్: భారత్లోని పాకిస్థాన్ హైకమిషనర్ను ఆ దేశం వెనక్కి పిలిపించింది. పాక్ హై కమిషనర్ ఇవాళ ఉదయం ఇస్లామాబాద్ నుంచి ఢిల్లీ బయలుదేరారు. అయితే ఆయన్ను మళ్లీ వెనక్కి రమ్మన్నట్లు పాక్ విదేశాంగశాఖ తెలిపింది. పుల్వామా దాడి తర్వాత రెండు దేశాల మధ్య వాతవరణం మరింత వేడెక్కింది. పాక్ విదేశాంగ శాఖ మాత్రం పుల్వామా దాడిని ఖండించింది. ఆ దాడికి పాక్ ఉగ్రవాదులే కారణమని భారత్ ఆరోపించింది. సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై జరిగిన దాడిలో 40 మంది జవాన్లు మృతిచెందిన విషయం తెలిసిందే. జైషే ఉగ్రవాద సంస్థపై చర్యలు తీసుకోవాలని పాక్పై భారత్ వత్తిడి తెస్తోంది. పాకిస్థాన్ విదేశాంగ శాఖ ఇవాళ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. పుల్వామా దాడి నేపథ్యంలో హైకమిషనర్తో చర్చించనున్నట్లు తెలుస్తోంది. పాక్ విదేశాంగశాఖ ప్రతినిధి డాక్టర్ మొహమ్మద్ ఫైసల్ ఈ ట్వీట్ చేశారు.