మహబూబాబాద్ : జిల్లా కేంద్రం శివారులోని బాబునాయక్ తండా, సాలార్ తండాలో ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్సెర్చ్ నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా 2 క్వింటాళ్ల నల్లబెల్లం, వెయ్యి లీటర్ల పానకం, 150 మద్యం సీసాలు, రెండు ట్రాక్టర్ల టేకు కలప, సరైన పత్రాలు లేని 20 బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్డన్సెర్చ్లో 200 మంది పోలీసులు పాల్గొన్నారు.