తిరుమల : తిరుమల శ్రీవారిని నల్లగొండ జిల్లాకు చెందిన పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇవాళ ఉదయం దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే కిషోర్ కుమార్, నల్లగొండ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నరసింహాయ్య, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ కలిసి శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. వీరందరికి ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి దగ్గరుండి దర్శనం చేయించారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదశీర్వచనం అందించారు. ఎమ్మెల్యేలందరికి ఆలయ అధికారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్ర్తాలతో సత్కరించారు.