ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీట్ల పంపకంపై నేడు ప్రకటించే అవకాశం : సంజయ్‌ రవుత్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 18, 2019, 02:35 PM

లోక్‌సభ ఎన్నికల్లో పొత్తుపై ఇరు పార్టీల అధ్యక్షులు నేడు ప్రకటన చేస్తారని శివసేన నేత సంజయ్‌ రవుత్‌ చెప్పారు. శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ థాక్రే, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించనున్నారని ఆయన చెప్పారు. 2019 లోక్‌సభ ఎన్నికలలో సీట్ల సర్దుబాటు విషయంలో ఇరు పార్టీల మధ్య వేడిగా, వాడిగా చర్చలు జరిగాయి. కేవలం లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటే కాకుండా మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కూడా సీట్ల సర్దుబాటుపై శివసేన గట్టి పట్టుపడుతోంది. మహారాష్ట్రలో బిజెపి-శివసేన కూటమి గెలిస్తే ముఖ్యమంత్రి పదవి తమకు ఇవ్వాలని శివసేన డిమాండ్‌ చేస్తోంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com