కేవలం రాజకీయంగా వేధించడానికే ఈడీ కేసును వాడుకుంటున్నారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. మీడియాతో చిట్చాట్లో భాగంగా రేవంత్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్, మోడీ ఒక్కటయ్యారు కాబట్టే తన మీద ఈడీ కేసు పెట్టారని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా రూ. 150 కోట్లు సీజ్ చేశారని గుర్తు చేసారు. పట్నం నరేందర్ రెడ్డి దగ్గర రూ.50 లక్షలు దొరికాయని, మరి ఆయనపై ఈడీ కేసు ఎందుకు పెట్టలేదని రేవంత్ సూటిగా ప్రశ్నించారు. తన మీద చార్జ్షీట్ వేసిన తర్వాత.. మళ్ళీ ఈడీకి ఎందుకు అప్పగించారని రేవంత్ రెడ్డి నిలదీసారు.