తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గా వేదాంతం గిరి బాధ్యతలు స్వీకరించారు. అశోక్ కుమార్ కేంద్ర సర్వీస్ కు బదిలీ నేపథ్యంలో అదనపు కమిషనర్ వేదాంతం గిరికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. మాజీ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ అశోక్ కుమార్ నుంచి బాధ్యతలు తీసుకున్నారు. అశోక్ కుమార్ కేంద్ర సర్వీస్ లో నేషనల్ వాటర్ మిషన్ డైరెక్టర్ బాధ్యతలు చేపట్టనున్నారు.