ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జయరాం హత్యలో ఐదుగురికి ప్రమేయం : డీసీపీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 18, 2019, 05:07 PM

హైదరాబాద్: జయరాం హత్యకేసు దర్యాప్తును హైదరాబాద్ పోలీసులు వేగవంతం చేశారు. జయరాం హత్యలో ఐదుగురికి సంబంధం ఉన్నట్లు గుర్తించినట్లు వెస్ట్‌జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులను మంగళవారం నుంచి విచారిస్తామని చెప్పారు. కేసులో దర్యాప్తు వివరాలను ఆయన మీడియాకు వివరించారు. రాజకీయ నేతలతో రాకేశ్‌కు సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోందని డీసీపీ పేర్కొన్నారు. రాకేశ్, శ్రీనివాస్ కాకుండా ఈ హత్యకేసులో మరో ఇద్దరు ఉన్నట్లు అనుమానిస్తున్నాం. నగేష్ అనే పేరు బయటికొచ్చింది. పోలీసుల ప్రమేయంపై కూడా విచారణ కొనసాగుతోందని డీసీపీ వివరించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com