ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంత్రిపదవుల కోసం ఎమ్మెల్యేలు ప్రగతిభవన్ చుట్టూ చక్కర్లు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 18, 2019, 06:25 PM

తెలంగాణ కేబినెట్ విస్తరణకు సమయం దగ్గర పడింది. రేపు ఉదయం 11:30 గంటలకు రాజ్‌భవన్‌లో కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇదిలా ఉంటే కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైనప్పటి నుంచి ఒకటే ఉత్కంఠ. ఎవరికీ మంత్రిపదవులు దక్కుతాయోనన్న ఆసక్తి చోటుచేసుకుంది. మంత్రిపదవుల కోసం ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు ప్రగతిభవన్ చుట్టూ చక్కర్లు కొట్టినా.. కొందరికే మాత్రమే బెర్త్‌లు ఖరారయ్యాయి. 


పలువురు ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్‌ నుంచి పిలుపు వెళ్లినట్లు తెలుస్తోంది. ఎర్రబెల్లి, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, కొప్పుల, ఈటల, ఇంద్రకరణ్‌రెడ్డికి కేసీఆర్ ఫోన్ చేశారు. రేపటి మంత్రివర్గంలో చోటుపై కేసీఆర్‌ ఫోన్‌లో సమాచారమిచ్చారు. అలాగే రంగారెడ్డి జిల్లా నుంచి మల్లారెడ్డికి చోటు దక్కే అవకాశం ఉంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com