సీఎం కేసీఆర్ తన క్యాబినెట్ లో అసమర్థులకు స్థానం కల్పిస్తారని, తాన తందాన అనేవారికే బెర్తులు ఇస్తారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ.రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్ కు తెలియకుండా బీజేపీ అధ్యక్షులు అమిత్ షా తో మాజీ మంత్రి టీ. హరీశ్ రావు ఫోన్ లో మాట్లాడారు. ఈ కుట్ర విషయం కేసీఆర్ కు అర్థమైంది. హరీశ్ రావు కు మంత్రి పదవి రాదు. మిడ్ మానేరు, గౌరెల్లి, తోటపల్లి పనుల్లో సుమారు రూ. 1వెయ్యి కోట్లు తీసుకున్నారు. తన బినామీలకే కాంట్రాక్ట్ లు ఇప్పించారు. ఆ డబ్బులనే కేసీఆర్ తెలియకుండా హరీష్ ఎన్నికల్లో తన వర్గం వారికి పంచారు. హరీష్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 30మందికి డబ్బులిచ్చారు. టీఆర్ఎస్ లో 26మందికి కోట్లాది రూపాయలు పంచారు. కొందరు కాంగ్రెస్ అభ్యర్థులకు కూడా డబ్బులు ఇస్తానంటే వాళ్లు తీసుకోలేదన్నారు. రేవంత్ రెడ్డి సోమవారం మీడియాతో చిట్ చాట్ చేసిన సందర్భంగా పై విషయాలు చెప్పారు. హరీష్ తోపాటు మరో నలుగురు సీనియర్లకు మంత్రి పదవి లేదు. తుమ్మల నాగేశ్వర్ రావు కేటీఆర్ ను రాము అని పిలిచినందుకే కత్తెర పెట్టారు. హరీశ్ ఎదురు తిరిగితే పాస్ పోర్ట్ కేసు లో ఇరికించేదుకు కేసీఆర్ రెడీ గా ఉన్నారు. కడియం సమర్థుడే.. ఒక్క అవినీతి ఆరోపణ లేదు. ఆయనకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వడంలేదు.?. మాదిగకు కేబినెట్ లో చోటు కనిపిస్తలేదు. కడియం, నాయిని లకు ఎందుకు కేబినెట్ లోకి తీసుకోవడం లేదో కేసీఆర్ చెబితే బాగుంటుంది. ఈటలపై నేను గతంలో చేసిన అవినీతి ఆరోపణలకు కట్టుబడి ఉన్నాను. పుల్వామాలో చనిపోయిన జవాన్లకు కేసీఆర్ నివాళులు అర్పించకపోవడం దారుణం. కేసీఆర్ దృష్టిలో జవాన్, కిసాన్ లకు విలువలేదు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తల్లి చనిపోతే రెండుసార్లు వెళ్లి పలకరించిన కేసీఆర్ జవాన్ కుటుంబాలను పలకరించలేదు. అదే నిజామాబాద్లో ఆందోళన చేస్తున్న రైతులను కేసీఆర్ పట్టించుకోలేదు. ఎర్రజొన్న, పసుపు రైతుల ను పట్టించుకోరు. ప్రభుత్వానికి వారం రోజులు టైం ఇస్తున్నా. వారం రోజుల్లో పరిష్కరించకపోతే నేనే ఆ రైతులకు మద్దతుగా వెళ్తానని హెచ్చరించారు. కేసీఆర్ కు అహంకారం తలకెక్కింది. పాలన పక్కన పెట్టి ప్రత్యర్థులను వేధిస్తున్నారు. కేసీఆర్, మోదీ ల మధ్య ఫెవికాల్ బంధం. ఎన్నికల్లో రూ.50లక్షలు దొరికిన పట్నం నరేందర్ రెడ్డి కేసు ఈడీ కి ఎందుకు ఇవ్వరు.?. ఐటీ శాఖ ఇస్తే కూడా ఈడీ ఎందకు విచారించదు.?. నాపై మాత్రం ఐటీ, ఈడీ కేసులు పెట్టించారు. ఈడీ కేసుల్లో నన్ను, వేం నరేందర్ రెడ్డిని వేధిస్తున్నారు. వేం నరేందర్ రెడ్ది కుమారులను పిలిచి విచారిస్తారా ..?. కేటీఆర్ కొడుకునంటే ఎంత బాధపడ్డారు. మరి మా పిల్లలను విచారిస్తే మేము ఊరుకోవాలా ..?. మొన్నటి ఎన్నికల్లో ప్రజలు కాదు ప్రభుత్వమే వోట్లేసింది అందుకే మేము ఓడాం. పోలీసులే దగ్గరుండి ఓట్లెపించారు. కొడంగల్ ఎన్నికల్లో పోలీసులు తప్పుచేశారని హైకోర్టు చెప్పింది. కొడంగల్ లో 60శాతం సర్పంచ్ లు కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచారు. పార్టీ ఓటమిపైన అంతర్గతంగా చర్చించుకుంటాం. లోక్ సభ ఎన్నికలు వాయిదా పడొచ్చు. పుల్వామా దాడి ఘటన నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం వాయిదా వేయించేందుకు ప్రయత్నించవచ్చన్నారు.