వికారాబాద్ : వికారాబాద్ జిల్లా పరిగిలోని ఓ పాడుబడ్డ బావిలో అగ్నిప్రమాదం జరిగింది. బావిలో ఉన్న చెత్తకు నిప్పంటుకోవడంతో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమందించారు. అగ్నిమాపక అధికారులు ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. స్థానికులు అప్రమత్తంగా ఉండటంతో ఎలాంటి నష్టం జరగలేదు.